డబుల్ బెడ్‌రూమ్ స్కీమ్ : పేద ప్రజలకు సొంతింటి కల సాకారం చేస్తోంది

తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన హౌసింగ్ ప్రాజెక్టునే డబుల్ బెడ్‌రూమ్ హౌసింగ్ స్కీమ్. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నివాస సదుపాయాలు లేని పేద ప్రజలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి, హైదరాబాద్‌ను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దాలని ఈ పథకం ద్వారా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రధానాంశాలు:

<a href=Double bedroom house (Pic Credit : TOI)" width="100%" height="" />

తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన హౌసింగ్ ప్రాజెక్టునే డబుల్ బెడ్‌రూమ్ హౌసింగ్ స్కీమ్. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నివాస సదుపాయాలు లేని పేద ప్రజలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి, హైదరాబాద్‌ను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దాలని ఈ పథకం ద్వారా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మార్చి 2019 నాటి కల్లా 2.72 లక్షల ఇళ్లను, 2024 నాటికి మరో 3 లక్షల ఇళ్లను ఈ స్కీమ్ కింద నిర్మించబోతున్నారు.

ఈ స్కీమ్‌ను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. రాష్ట్రంలో పేదలకు 5.72 లక్షల ఇళ్లను నిర్మించి ఇవ్వనున్నట్టు తెలిపింది. దీనిలో 2 లక్షల ఇళ్లను హైదరాబాద్‌లోనే కట్టనున్నామని ప్రకటించింది. డబుల్ బెడ్‌రూమ్ హౌస్‌ల పైలట్ ప్రాజెక్టును తొలుత ఎర్రవల్లిలో మార్చి 5, 2016న నిర్మించారు. ఈ గ్రామాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్‌ బెడ్రూం ఇండ్లతో పేద మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో మేలు చేకూరుతోంది. వారి సొంతింటి కల సాకారమవుతోంది. సకల హంగులు.. అన్ని వసతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తోంది.